మళ్లీ జూపల్లి-అరుణ రగడ


మహబూబ్‌నగర్ మంత్రులు జూపల్లి, డికె అరుణల పంచాయతీ మళ్లీ మొదలైంది. జూపల్లితీరుపై మంత్రి డికె అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూపల్లి కృష్ణారావు తన రాజకీయస్వార్థం కోసం ఇతర కాంగ్రెస్ నేతలందర్నీ తెలంగాణద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని, దీన్ని సహించజాలమని ఆమె స్పష్టం చేశారు. పాదయాత్ర అయినా,మరే ఇతర ఆందోళన అయినా జిల్లా కాంగ్రెస్ పక్షాన జరగాలని, అప్పుడు అందరూ పాల్గొనవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. జూపల్లి వైఖరిపై జూన్‌ ఒకటి వరకు వేచి చూస్తామని, ఆ తరువాత సోనియాగాంధీకి కృష్ణారావుపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాయనున్నట్లు ఆమె చెప్పారు. దీంతో మళ్లీ ఈ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం మరింతగా రాజుకుంటుంది. మళ్ళీ గద్వాల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానని జూపల్లి కృష్ణారావు అంటుంటే. నేను అడ్డుకోనని, మరేవరైనా అడ్డుకుంటే తనకు సంబంధం లేదని అరుణ చెప్పారు. పోలీసులు సైతం జూపల్లి పాదయాత్ర గద్వాలలో చేయకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఈనేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ఏర్పడుతాయా అన్న అనుమానం కలుగుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!