రాధాకృష్ణ వర్సెస్ రాంబాబు
ఎబిఎన్ ఆంద్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకి, వైఎస్సార్ కాంగ్రెస్ పర్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబబుకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అంబటి రాసలీలలంటూ ఎబిఎస్ ఛానెల్లో ఓ వార్తా కథనం రావడం, అది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించడంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవరానికి కూడా గురిచేసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కేవలం 150 రూపాయల జీతం కోసం పనిచేసిన రాధకృష్ణ కోట్లు ఖర్చుపెట్టి ఛానెల్ కి అధిపతి ఎలా అయ్యాడని రాంబాబు ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు రాధాకృష్ణ తన మీడియాను అడ్డం పెట్టుకుని పలుకుబడి కలిగిన వ్యక్తులని, స్వాములని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడని కోట్ల రూపాయలు వారి వద్దనుండి తీసకుంటున్నాడని ఆరోపించాడు. చంద్రబాబు నాయుడు రాధాకృష్ణకి సబ్జలవిద్యుత్ ప్రాజెక్టుని ఎందుకు ఇచ్చాడని ప్రశ్నించాడు. రాధాకృష్ణ చంద్రబాబుకి ఊడగం చేయబట్టే ఆయన ఇచ్చాడని అన్నారు. రాధాకృష్ణకి వ్యక్తిత్వంలేదని, ఆయ...