హైదరాబాదులో బాంబ్ బ్లాస్ట్..?
తీవ్రవాదులకి హైదరాబాద్ టార్గెట్ కానుందా..? గతంలో గోకుల్ చాట్, లుంబినీ పార్క్ల మాదిరి మళ్లీ బాంబ్ బ్లాస్ట్లకి ప్లాన్లు చేస్తున్నారా..? రాజధానిలో తీవ్రవాదులు రెక్కీలు నిర్వహిస్తు న్నారా..? ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాంబుదాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? ఈ ప్రశ్నలు ప్రస్తుతం పోలీసులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే హైదరాబాదు నగరంలో మరోసారి పోలీసులు భారీ పేలుడు పదార్థాలు గుర్తించారు. సుమారు 870 జిలెటిన్ స్టిక్స్, 1900 వరకు డిటోనేటర్లు గుర్తించారు. వీటిని నార్త్ జోన్ పోలీసులు గురువారం గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ కలిగి ఉన్న ఏడుగురు నిందితులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. కారు, ఓ ద్విచక్ర వాహనం, రూ.25 వేలు సీజ్ చేశారు. పోలీసీలు వారిని విచారిస్తున్నారు. నిందితులు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదు పోలీసులు కంచన్బాగ్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిం...