కడపలో రీపోలింగ్..
కడపలోని ఒక కేంద్రంలో రీపోలింగ్ నేడు జరుగుతోంది. బెల్లంమండి అనే గ్రామంలో ఈ పోలింగ్ జరుగుతోంది. తాము వేసిన ఓట్లు ఒక గుర్తుకు వేస్తే మరో గుర్తుకి కౌంట్ అయ్యాయని స్థానిక ఓటర్లు ఫిర్యాదు చేయడంతో బెల్లంమండిలో రీపోలింగ్ నిర్వహించాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. కేవలం 906 ఓట్లు ఉన్న ఈ గ్రామంలో రీపోలింగ్ ద్వారా ఏ పార్టీకి పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ రూల్స్ ప్రకారం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.