ప్రపంచంలోనే ఖరీదైన దేవుడు..
ప్రపంచంలోనే ఖరీదైన దేవుడు గా ఇప్పుడు కేరళ తిరువనం తపురం లోని అనంత పద్మనాభస్వామి వెలుగొందుతు న్నాడు. భారత దేశంలోనే అతి ఖరీదైన దైవంగా కొలువబ డుతున్న ఆ తిరుపతి వేంకటేశ్వరుని వెనక్కినెట్టి తన లక్షల కోట్ల రూపాయల గుప్త నిధులతో ఖరీదైన దైవంగా అనంత పద్మనాభస్వామి ముందుకు వచ్చారు. పద్మనా భస్వామి దేవాలయంలో ఉన్న 5 మాళిగలలో శతాబ్దాల కాలం నుండి మూలుగుతున్న సంపదని వెలికి తీసారు. బంగారు, వజ్ర, వైఢూర్యాలు వెలకట్టలేనంతగా బయట పడ్డాయి. వాటిని లెక్కించడం కాదు, కేవలం అంచనా ప్రకా రం ఆ నిధి విలువ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువచేస్తుందని అనధికార అంచ నా. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం బయటపడ్డ సంపద వివరాలు ఇలా ఉన్నాయి. - నాటి రాజకుటుంబానికి చెందిన కిరీటాలు, – 17 కిలోల బంగారు నాణేలు, – 2.5 కిలోల బరువు, 18 అడుగుల పొడవు ఉన్న షర పోలి మాల, – బంగారు తాళ్లు, – ఒక బస్తా నిండా వజ్రాలు, – వేల సంఖ్యలో పురాతన నగలు, – బంగారు పాత్రలు, – వివిధ రాజకుటుంబాలు, యాత్రికులు, వర్తకులు చేసిన దానాలు, – పలు శతాబ్దాల క్రితం నా...