తమిళ హీరో కన్ను తెలుగు గుమ్మపై..
హీరోయిన్లతో ఎఫైర్లు నడిపించడంతో తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్ని ఏర్పాటు చేసుకున్న తమిళ హీరో ఎవరూ అని అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు శింబు. తనతో నటించే హీరోయిన్లను పటాయించడంలో శింబు అందెవేసిన చెయ్యి. గతంలో శ్రియ, అసిన్, నయనతార తదితర హీరోయిన్లను పటాయించి, వారితో ప్రేమాయణం కూడా సాగించిన చరిత్ర శింబుకి ఉంది. ప్రస్తుతం శింబు చూపు మన తెలుగు ముద్దు గుమ్మ మధుశాలినిపై పడింది. తెలుగులో అవకాశాలు లేక చతికిలబడిపోయిన మధుశాలినికి పిలిచి మరీ తన సినిమాలో హీరోయిన్ వేశం ఇచ్చాడట శింబు. తమిళనాట శింబుకి ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా హిట్టయితే మధుశాలిని పంట పండినట్టే.. అయితే శింబు అవకాశాలు లేక గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న మధుశాలినిని ప్రత్యేకంగా పిలిచి మరీ హీరోయిన్ వేశం ఎందుకిచ్చాడబ్బా.. అని కోలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.