ఆయన ఇళ్లంతా స్వర్ణమయమే.. ఇదేమీ ‘ గాలి’ వార్త కాదండోయ్..
మైనింగ్ గనుల కాంట్రాక్టర్, బిజెపి నాయకుడు, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇళ్లంతా బంగారు మయమే.. ఎవరైనా బంగారంతో ఆభరణాలు చేయించుకుంటారు, బంగారు విగ్రహాలు చేయించుకుంటారు… ఇంకా చెప్పాలు బంగారు గొలుసులు, ఉంగరాలు.. లాంటివి మనం చూస్తాం.. కానీ గాలి జనార్థన్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా బంగారాన్ని మలుచుకున్నారు. ఆయన కూర్చునే కుర్చీని కూడా ఆయన బంగారం తో తయారు చేయించారు. దాని ఖరీదు 2.2 కోట్ల రూపాయలు. అంతేకాదు ఆయన పెట్టుకునే బెల్టు అక్షరాలా 13.15 లక్షల రూపాయలు.. అదీ బంగారంతో తయారు చేసినదే.. అంతేకాదు ఆయన బంగారు పల్లెంలోనే తింటారు. గిన్నెలు, చెంచా, ఫోర్కు, కత్తి – అన్నీ బంగారానివే. వీటి విలువ రూ. 20.87 లక్షలు ఉంటాయని సమాచారం. అంతేకాదు ఆయన బంగారంతో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేస్తారు. వాటి విలువ రూ. 2.28 కోట్లు. ఇలా ఆయన ఇంట్లో ఉండే చెంచాల నుండి విలువైన సామానులన్నీ బంగారంతో తయారుచేసినవే.. ఈ వివరాలని స్వయంగా ఆయనే లోకాయుక్తకు 2010 వరకు తమకు ఉన్న ఆస్తుల విలువ సమాచారాన్ని నివేదించినపుడు వీటన్నింటినీ ఆయన జోడించార...