దేశద్రోహి జానారెడ్డి..?
రాష్ట్ర మంత్రి జానారెడ్డి తెలంగాణ అంశంపై చర్చలను ఇండియా, పాకిస్తాన్ చర్చలతో పోల్చడం దారుణమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యా నించారు. మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని ఆయన అన్నారు.కాంగ్రెస్ తెలంగాణ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి ఉచ్చులో చిక్కుకు న్నారని ఆన అన్నారు . జానారెడ్డి ,తదితరులు కాని, ఎమ్.పి పొన్నం ప్రభాకర్ కాని కెసిఆర్ మాటలు విని రాజీనామా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరు ఆయనను రాజీనామా చేయ మన్నారు?కాంగ్రెస్ హైక మాండ్ కు చెప్పి రాజీనామా చేశారా అని ప్రశ్నించారు.తెలంగాణ నేతల వైఖరి వల్ల కాంగ్రెస్ కు నష్టం జరుగు తోందని ఆయన వాపోయారు.నెల్లూరు కు చెందిన ఈ నాయకుడు సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లా డుతుం టారు. అయితే కాంగ్రెస్ అదిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు. కాగా కాంగ్రెస్ తొలి ముద్దాయి అని పొన్నం ప్రభాకర్ అనడం ఏమాత్రం పద్దతిగా లేదని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. వివేకా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ తొలి ముద్దాయి అవుతుంది. తెలంగాణ ఇస్తే ...