మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన..?
మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు భారీ గా ఉండొచ్చని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తీ చేసారని సమాచారం .మార్పుల చేర్పుల జాబితా పై అధిష్టానం ఆమోద ముద్ర వేయించు కోవడమే తరువాయి అంటున్నారు . నెలాఖరులోగా ముఖ్యమంత్రి డిల్లీ వెళ్ళే అవకాశాలున్నాయి .పనితీరు, సామాజిక వర్గం, విధేయత ప్రాతిపదికన మంత్రివర్గ మార్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో కనీసం 5 -6 మందిని తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది . ముఖ్యమంత్రి సన్నిహితుల కథనం ప్రకారం మంత్రివర్గం నుంచి స్థానం కోల్పోనున్న వారిలో పి శంకరరావు, సబితా ఇంద్రారెడ్డి, పి విశ్వరూప్, కాసు వెంకట కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అహ్మదుల్లా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వ్యవసాయమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, దేవాదాయ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవులకు ఇంతకు ముందే రాజీనామా చేశారు. అలాగే పిసిసి అధ్యక్షునిగా నియమితులైన కారణంగా బొత్స సత్యనారాయణ కూడా రాజీనామా చేయబోతున్నారు . మంత్రివర్...