టిడిపిలోకి వలసలే వలసలా..?
వైయస్ హయాంలో అవినీతి జరిగితే అది తమకు సంబంధం లేదని మంత్రివర్గం చెబుతోందని, సిబిఐ విచారణలోనూ కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ఆధారాలతో సహా దొరికే అవకాశం ఉన్నందున ఆయన వెంట వెళ్లేందుకు ఎవరూ సాహసించరని, ప్రస్తుతం ఆయన వెంట ఉన్న వారూ టిడిపి వైపు చూస్తారని టిడిపి మేధో మథన సదస్సు గురువారం అభిప్రాయపడింది. కాంగ్రెసు పార్టీ సైతం జాతీయస్థాయిలో తీవ్ర అవినీతిలో కూరుకు పోయినందున చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వారు సైతం టిడిపి వైపే చూస్తారని అభిప్రాయపడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాటు ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, పార్లమెంటరీ ఇన్ఛార్జులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు తదితర ముఖ్య నేతలు పాల్గొన్న రెండు రోజులమేధో మథనం సదస్సు గురువారం ముగిసింది. జాప్రతినిధులు అక్రమాలకు, అవినీతికి పాల్పడితే ఎప్పటికైనా బయట పడుతాయని, వారి అక్రమాలు బయట పడినప్పుడు వారి వెంట ఉండటానికి మిగిలిన నాయకులు, కార్యకర్తలు భయపడతారని అభిప్రాయపడింది. అంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తెలుగుదేశం పార్టీ తమకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు మమ్మురం చేస్తుందన్నది అర్థమవ...