పోస్ట్‌లు

raja kanimoli gali janardhan reddy yadyurappa 2g spectrum mining mafia land settilments pllitical news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

2జీ కేసులో మొదటి బెయిల్

చిత్రం
2జీ కుంభకోణంలో మొట్ట మొదటి బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో ఐదు కార్పోరేట్ కంపెనీల ప్రతినిధులకు బుధవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించినా ఒక్కొక్కొరికీ రూ.5 లక్షల పూచీకత్తుపై ఉన్నతన్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సంజయ్‌చంద్రా, వినయ్‌గోయాంక, గౌతందోషి, హరినాయర్, సురేంద్రపిపారాకు బెయిల్ మంజూరు అయింది. గత ఏడు నెలలుగా వీరు తీహారు జైలులో ఉన్నారు.

పాపం.. ఆ న‌లుగురు..!

చిత్రం
ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా దీపావ‌ళి పండుగ‌ని దేశం యావ‌త్తూ జ‌రుపుకున్నారు.. కానీ.. పాపం.. ఆ న‌లుగురు నాయ‌కులు మాత్రం.. ఆత్మీయుల‌కి, ఆప్తుల‌కి దూరంలో, ఖైదీల మ‌ధ్య దీపావ‌ళి పండుగ‌ని జ‌రుపుకున్నారు. ఇంత‌కీ వారు ఎవ‌ర‌నే క‌దా.. యడ్యూరప్ప, ఏ.రాజా, కనిమొళి, గాలి జనార్థన్‌రెడ్డి. వీళ్లంతా పేరు మోసిన రాజకీయ నేతలు. ఆయా రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇందులో ఒకరు సీఎంగా పనిచేసిన వ్యక్తైతే మరొకరు మాజీ సీఎం ముద్దుల కుమార్తె. ఇంకొకరు కేంద్రమంత్రిగా బాధ్యతలు వెలగబెట్టారు. మరొకరు రాష్ట్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. టూజీ స్పెక్ట్రమ్‌ కేసులో చిక్కుకొని కేంద్రమాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి విలవిలలాడుతున్నారు. లేటెస్ట్‌గా కనిమొళి బెయిల్‌ పిటీషన్‌పై విచారించిన సీబీఐ కోర్టు కరుణ గారాల పట్టికి బెయిల్‌ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని వచ్చేనెల 3న నిర్ణయించనుంది. దీంతో కనిమొళి కూడా కటకటాల వెనుకే కలర్‌ఫుల్‌ దివాళీ జరుపుకోనున్నారు. టూజీ స్పెక్ట్రమ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఏ.రాజా కూడా...