తుర్లపాటికి జాతీయ రేడియో ప్రతిభా పురస్కారం
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన డాక్యుమెంటరీ అదిగో హరివిల్లుకు 2010 సంవత్సరానికి గాను జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఈ రూపకాన్ని సీనియర్ జర్నలిస్టు తుర్లపాటి నాగభూషణ రావు రచించారు. కాగా, ఆకాశవాణి కేంద్ర కార్యక్రమ నిర్వహణాధికారి కె. విజయ పర్యవేక్షణలో ఈ డాక్యు మెంటరీ రూపొందింది. వీరిద్దరికీ ఆకాశవాణి కేంద్రం ప్రతిభా పురస్కారాలను అందజే స్తుంది. తుర్లపాటి నాగభూషణ రావు గతంలో ఆంధ్రప్రభతోపాటుగా ఈనాడు, తెలుగువన్ డాట్ కామ్ సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం టివీ5 న్యూస్ లో పనిచేస్తున్న తుర్లపాటి నాగభూషణరావు రాసిన నిప్పురవ్వ – డైలీమిర్రర్ ఎపిసోడ్ బంగారు నంది అవార్డుకు ఎంపికైంది. కాగా, ఆయన సమర్పణలో ప్రసారమైన `బాలికలతో మరణమృదంగం’ చర్చా కార్యక్రమానికి యునిసెఫ్ -2011 అవార్డు లభించింది.