వర్మా… ఇదేమి గోల..!
మనదేశంలో ఎవరిగోల వారిదిగా మారింది. అంతేకాదు.ఎవరి వ్యాపారం వారిదిగా ఉంది. ప్రముఖ సినీ దర్శ కుడు దేశంలో ఏదైనా సంచలన ఘటన జరిగితే, అక్కడికి వాలి పోతారు.ముంబైలో టెర్రరిస్టుల దాడులు జరి గితే అప్పట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ తో కలిసి దాడికి గురైన ఆ హోటల్ కు వెళ్లారు. ఒక సినిమాకు అవసరమైన సన్నివేశాలకోసం. విలాస్ రావు కుమారుడితో సినిమా తీయాలన్నది ఉద్దేశం కాబట్టి సి.ఎమ్. కూడా ఒప్పు కున్నారు. అది అప్పట్లో పెద్ద దుమారమే అయింది. అలాగే ఈ మధ్య బెజవాడ రౌడీలు అనే పేరుతో సినిమా తీయడం మరో వివాదం. రక్తచరిత్ర సినిమా ఎంత ఉద్రిక్తత సృష్టించిందో చెప్పన వసరం లేదు. ఇప్పుడు తాజాగా నీరజ్ గ్రోవర్ అనే టివీ ఎక్జిక్యూటివ్ హత్య కేసులో నిందితురాలైన మరియాతో సినిమా తీయాలని వర్మ ప్రతిపాదిస్తున్నారు. ఆయన ఇందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. మహ రాష్ట్రలో ఇది పెద్ద సంచలన కేసుగా మారింది.దీనిని నాట్ ఎ లవ్ స్టోరీగా సినిమా తీయాలన్నది వర్మ ఉద్దేశం. దీనిపై శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన మండి పడ్డాయి. మరియతో సినిమా తీస్తే సహించబోమని ఆ పార్టీలు హెచ్చరిస్తున్నాయి...