పోస్ట్‌లు

ananta padmanabha swamy temple kerala tiruvananta puram venkateshwara swamy sensational articls hot news international news padmanabha swamy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప‌ద్మనాభ‌స్వామి ఆల‌య స‌మీపంలో భారీ పేలుడు

చిత్రం
ల‌క్షల‌కోట్ల రూపాయ‌ల సంప‌ద బ‌య‌ట‌ప‌డిన కేర‌ళ‌, తిరువ‌నంత‌పురంలోని అనంత ప‌ద్మనాభ‌స్వామి ఆల‌య స‌మీపంలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఆల‌య స‌మీపంలో ఉన్న దుకాణాల‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిన మంట‌లు, భారీ పేలుళ్ళ శ‌బ్దాల‌తో ఆల‌య ప్రదేశం ద‌ద్దరిల్లింది. ఈ ఆల‌యం నుండి ల‌క్షల కోట్ల నిధి బ‌య‌ట‌ప‌డి ప్రపంచం దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం తెలిసింది. ఆల‌యంలోని 5 నేల‌మాళిగ‌ల‌లోనుండి ఈ నిధి బ‌య‌టికి తీసారు. అయితే ఆర‌వ నేల‌మాళిగ‌ను తెర‌వ‌డానికి ప్రయ‌త్నించినా ఆ నేల‌మాళిగ‌కు నాగ‌బంధ‌నం ఉంద‌న్న తెలుసుకుని దానిని తెరిచే ప్రయ‌త్నం విర‌మించుకున్నారు. మ‌రో ప్రక్క ఆ 6వ నేల‌మాళిగ‌ను ప‌రిశీలించ‌డానికి సోమ‌వారం నాడు నిపుణుల బృందం ఆల‌యానికి రాబోతున్నారు. ఈ సంద‌ర్భంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం అంద‌రినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘ‌ట‌న వెనుక కార‌ణం ఏమై ఉంటుంద‌న్నదాని గురించి చ‌ర్చలు మొద‌ల‌య్యాయి. 6వ నేల‌మాళిగ‌ని తెరిస్తే అరిష్టం అని, దాన్ని తెరిచే ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని కొంద‌రు చెప్పిన‌ప్పటికీ దాన్ని తెర‌వడానికి చేస్తున్న ప్రయ‌త్నం కార‌ణంగానే ఈ సంఘ‌ట‌న జ‌రిగి...

`అనంత’ సంపద వెనుక కన్నీటి కథలు- 6

చిత్రం
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నాగబంధం వెనుక దాగున్న రహస్యాలను తిరువనం తపురం లోని స్థానికుల నుంచి తెలుసుకునే ప్రయత్నం ఈ రచయిత చేస్తున్నారు. కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంత మంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజాస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసినవారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని ఇలాంటి చాలా స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్న అంశాలను క్రోడీకరించే పని ఐదో భాగంలో ప్రారంభమైంది. పది అంశాలను మీరు చదివే ఉంటారు. మిగతా పాయింట్స్ ఇవి… 11. నాగబంధం ఒకసారి వేస్తే, అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది. 12. ఐదు తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే అవి నిధినిక్షేపాలను కాపాడుతుంటాయి. 13. అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉన్నది. ఇది మొత్తం నిధినిక్షేపాలకు సంబంధించిన బంధమే కానీ, కేవలం ఆరోగదికి మాత్రమే పరిమితమైనది కాదు. 14. అందుకే, నిధినిక్షేపాలున్న గదులు తెరవగాన...

`అనంత’ సంపద వెనుక కన్నీటి కథలు- 5

చిత్రం
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగలో అపార సంపద బయటపడినం  దుకు సంతోషించాలో, లేక ఆరో గదికి నాగబంధం ఉన్నం దుకు భయపడాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, అక్కడి స్థానికులు (తిరువనంతపురం వాసులు) చెబ్తున్న విషయాలు చాలా చిత్రంగా అనిపిస్తుండటమే… కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంత మంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజాస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసినవారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని ఇలాంటి చాలా స్పష్టంగా చెబుతున్నారు....

అనంత క‌న్నీటి క‌థ‌లు పై విశేష‌ స్పంద‌న..

చిత్రం
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> అనంత ప‌ద్మనాభ‌స్వామి వారి ఆల‌యంలో నిధి వెలికితీయ‌డంతో ఆ మందిరానికి, ఆ మందిరం కేంద్రంగా రాజ్యాన్ని పాలించిన రాజుల‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన‌, చారిత్రాత్మక‌మైన క‌థ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి.. అయితే వాట‌న్నిటికి భిన్నంగా ప్రముఖ ర‌చ‌యిత‌, సీనియ‌ర్ జ‌ర్నలిస్టు శ్రీ తుర్లపాటి నాగ‌భూష‌ణం గారు ప‌రిశోధాత్మకంగా ర‌చించిన అనంత సంప‌ద వెనుక‌ క‌న్నీటి క‌థ‌లు ‌వ్యాసాల‌కి విశేష‌మైన స్పంద‌న వ‌స్తోంది.. వాటిని య‌థాత‌దంగా పాఠ‌కుల‌కు అందిస్తున్నాము.. రచయిత తుర్లపాటి నాగభూషణ రావు,  `అనంత’ సంపద వెనుక కన్నీటి కథలప...

అనంత సంపద వెనుక కన్నీటి కథలు – 2

చిత్రం
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> ట్రావెన్ కోర్ రాజ్యం (తిరువనంతపురం రాజ్యం) అనేక ఒత్తిళ్లకు గురవుతుండేది. నాటి రాజులకు యుద్ధభ యం ఉండేది. మార్తండ వర్మ 1750 ప్రాంతంలో తన రాజ్యాన్ని అనంతపద్మనాభస్వామి పాదాలకింద ఉంచేశాడు. అంటే, రాజ్యభారాన్ని స్వామికే వదిలేశాడు. మామూలుగా మాటలతో చెప్పడంకాదు, ఈ మే రకు రాజశాసనం చేశాడు. అప్పటి నుంచి ట్రావెన్ కోర్ రాజ్య భారం అనంత పద్మనాభస్వామిదే అయింది. రాజు అన్న వాడు కూడా పద్మనాభ దాసుడే. రాజ్యంలోని ప్రతిఒక్కరూ పద్మ నాభదాసులే నంటూ చాటిం చాడు. దీంతో మార్తండ వర్మకు కొంతలో కొంత యుద్ధ భయం తీరింది. సాక్షాత్తు పద్మ...

`అనంత’ సంపద వెనుక కన్నీటి కథలు – 1

చిత్రం
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> కేరళలోని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో అపార నిధినిక్షేపాలు దొర కడం మనకెంతో ఆనందాన్ని కలిగించి ఉండవచ్చు. ఐదులక్షల కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభర ణాలు, నగలు, వజ్రవైఢూర్యాలు నేలమాళిగ గదుల్లో కనిపించడం మన అపూర్వ సంపదకు మనకుమనమే పొంగిపోయి ఉండవచ్చు. కానీ ఆసంపద ఎలా వచ్చిందో తెలుసుకుంటే, వాస్తవాలు వెలికితీస్తే గుండె బరువె క్కడం ఖాయం.  అనంత పద్మనాభస్వామివారికి కానుకలుగా ఇచ్చిందికాకుండా నాటి ప్రభువులు, సంస్థా నాధీశుల నిరంకుశ దోపిడీ ఫలితంగా కూడా ఎంతో విలువైన సంపద దేవలం నేలమాళిగలోకి చేరాయన్నది ...