ఓయూ క్యాంపస్లో ఉద్రిక్తత..!
బంద్ సందర్భంగా ఉస్మానియా యూనివర్షిటీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడానికి ప్రత్యేక తెలంగాణ కోసం తమవంతు నిరసనని తెలపడం కోసం ఉద్యుక్తులయ్యారు. విద్యార్థులు తలపెడుతున్న ఈ ర్యాలీ ద్వారా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ఉస్మానియా క్యాంపస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. గతంలో ఉస్మానియా క్యాంపస్లో జరిగిన అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా పోలీసులు అన్ని జాగ్తత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓయూ విద్యార్థులు తలపెట్టిన ర్యాలీకి సంఘీభావం తెలపడానికి ఉస్మానియా క్యాంపస్కి చేరుకున్న నాగం జనార్థన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నాగం పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. క్యాంపస్లోనికి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నాగం జనార్థన్రెడ్డిని క్యాంపస్లోనికి అనుమతించాలను ఉస్మా నియా విద్యార్థులు కూడా పట్టుపట్టారు. దాంతో క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చేసేదిలేక పోలీసులు నాగంని అరెస్టు చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జితో పాటు భాష్పవా...