తెలంగాణ జిల్లాల్లో రైల్రోకో…!
తెలంగాణ పొలిటికల్ జెఏసి ఇచ్చిన పిలుపుతో నేడు తెలంగాణ జిల్లాలంతటా రైల్రోకో కార్యక్రమం జరుగు తోంది. అన్ని జిల్లాల్లో ఆ యా రైల్వే స్టేషన్లలో ఉద్యమ కారులు పట్టాలపై కూర్చుని తమ నిరసనలని తెలుపు తున్నారు. దక్షిణమధ్య రైల్వే ముందుగానే అప్రమత్తమై నేడు రైళ్ళని రద్దు చేయడంతో ఉద్యమం కాస్త సాఫీగానే జరుగుతుంది. ముందు జాగ్రత్త చర్యగా ఆర్.టి.సి. బస్సులను ఆయా రైల్వే స్టేషన్ల ముందు రెడీగా ఉంచారు. ప్రయాణీకులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని జగ్రత్తలు తీసుకు న్నామని చెబుతు న్నప్పటికీ.. అక్కడక్కడ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బం దులని ఎదుర్కొంటున్నారు. టి.ఆర్.ఎస్., టి.డి.పి. కార్యక ర్తలు ఈ రైల్రోకో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్ రోకో కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన బి.జె.పి. నేత బండారు దత్తాత్రేయని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని స్టేషన్లోకి వెళ్లనీయకుండా అడ్డుకు న్నారు. దాంతో దత్తాత్రేయ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. నేడు జంటనగరాలలో తి...