ఈ హీరోల క్రేజీ పడిపోయిందా..?
ఒకప్పుడు క్రేజ్ ఉన్న తారలకు ఇప్పుడు అసలు డిమాండు ఉండకపోవడంతో వారు నటించిన సినిమాలను పంపిణీ చేయాలంటేనే పంపిణీదారులు భయపడుతున్నారట. ఈజాబితాలో పలువురు ప్రముఖ నటులు చేరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో కొత్తవారితోకాని, పాత నటులలో ప్రేక్షకు లను ఆకర్షించే శక్తి కోల్పోయా రని భావిస్తున్నవారితో కాని సినిమా తీయాలంటేనే నిర్మాతలు అంతగా సుముఖత చూపడం లేదట. దీనిపై వస్తున్న కధనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి టాలివుడ్ లో టాప్ ఫైవ్ స్టార్స్ కే మార్కెట్ ఉంటోం దని సిని విశ్లేషకులు కధనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం అంతగా గిరాకి లేని నటులలో శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, నాని, తనిష్, ఆకాష్, నవదీప్, ఆర్యన్ రాజేష్, శివాజి, కృష్ణుడు, రాజ, నిఖిల్ వంటి నటులతో సినిమాలు తీయడానికి నిర్మాతలు వెనుకాడుతున్నారట.స్టార్ స్టేటస్ లేని నటులతో సినిమా తీస్తే, ఆ సినిమా ఆడడం కష్టం అవుతోందని, జనాన్ని హాళ్లకు రప్పించడానికి అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రముఖ పంపిణీదారుడు, పుల్లారెడ్డి చెబుతున్నారు.మరో నిర్మాత , డైరెక్టర్ సిద్దార్ధ ఈ వాదనతో అంగీక రిస్తూ, సినిమాలను ప్రసారం చ...