ఢిల్లోలో హైకోర్టునందు బాంబ్ బ్లాస్ట్
ఢిల్లీ హైకోర్టు దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. బుధవారం ఉదయం 10:17 గంటలకు గేటు నెంబర్-5 వద్ద గల పార్కింగ్ స్థలంలో ఉన్న కారులో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దాదాపు 25 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురు లాయర్లు ఉన్నట్లుతెలుస్తోంది.. ఘటనాస్థలంలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే క్షతగాత్రులను సఫ్దర్గంజ్, రామ్మనోహర్ లోహిమా ఆస్పత్రులకు తరలించారు. కోర్టు వద్ద బాంబు పేలుళ్లు నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. పేలుళ్లతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. పేలుడు సమాచారంపై నివేదికను అందజేయాలని ఢిల్లీ పోలీసులకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనతో దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు.