మళ్ళీ టెర్రర్ ఎటాక్ ! తట్టుకోగలమా?
మళ్ళీ టెర్రరిస్టులు ఎటాక్ చేస్తే మనం తట్టుకోగలమా..? ముంబాయి తరహా కాల్పులకి ఎగబడితే మనం భరించగలమా..? ఒకేసారి మూకుమ్మడిగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ఇలాంటి అఘాయిత్యాలకి టెర్రరిస్టులు పాల్పడితే అరికట్టగలమా…? పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై పంజావిసిరి నేటికి సరిగా మూడేళ్లు. దేశ అంతర్గత భద్రతకే సవాల్ గా మారిన ఈ తరహా దాడులు మరోసారి జరిగితే మనదేశం తట్టుకోగలదా? సమర్థవంతంగా తిప్పికొట్టగలదా? అసలు పౌరుల రక్షణకు పాలకులు తీసుకుంటున్న చర్యలేమిటి? నిఘానేత్రాల కళ్లుగప్పి, చీకటివేళ సముద్రమార్గంగుండూ ముంబయితీరానికి చేరి ముష్కరమూకలు మహావిధ్వంసం సృష్టించడంతో దేశం ఉలిక్కిపడింది. అప్పటి నుంచీ ఇప్పటివరకు కేసు దర్యాప్తులో ఏమేరకు ప్రగతి సాధించగలిగాం? ఉగ్రవాదుల దాడులకు ముంబయి వణికిపోయి నేటికి సరిగా మూడేళ్లు. ముంబయి నగరవాసుల్లోనే కాదు, ఏకంగా దేశ ప్రజల్లోనే భద్రతపై నమ్మకంపోయిన రోజు. కన్నీట మసకబారిన కళ్లతో జాతి ఏకమైన రోజు అది. ఉగ్రవాదాన్ని అంతమొంది...