విమాన ప్రమాదంలో హాకీ ఆటగాళ్ళు దుర్మరణం
ప్రపంచంలో ఎక్కడ విమాన ప్రమాదాలు జరిగినా అవి దారుణంగా ఉంటాయి. బుధవారం రాత్రి జరిగిన విషాద ఘటనలో ఐస్ హాకీ ఆటగాళ్లు మరణించడం అందరిని కలచి వేస్తుంది.రష్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 43 మంది ఐస్ హాకీ ఆటగాళ్లు దుర్మరణం చెందారు.టేకాఫ్ సమయంలో యాక్ 44జెట్ విమానం ప్రమాదానికి గురై కూలినప్పుడు వీరంతా మరణించారు. విమాన సిబ్బంది ఎనిమిది మంది కూడా మృతి చెందారు.రష్యా,స్లొకేవియా, జర్మని, స్వీడన్ దేశాలకు చెందిన క్రీడకారులు మరణించడంతో యూరప్ తోపాటు ప్రపంచం అంతా విషాదచ్చాయలు అలుముకున్నాయి.క్రీడాభిమానులందరు ఈ ఘటన విని బాధపడుతున్నారు.