కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు
నేడు కేంద్ర కేబినెట్ని ప్రక్షాళన చేసేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్యుక్తులయ్యారు. వాటి వివరాలు, కిషోర్ చంద్రదేవ్కు పంచాయితీ రాజ్, గిరిజన సంక్షేమం, మమతా బెనర్జీ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రైల్వే శాఖని మళ్లీ తృణమూల్కే ఇచ్చేందుకు ప్రధాని నిర్ణయం. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతి నిథ్యం వహిస్తున్న జైరాం రమేష్కు కేబినెట్ హోదా కల్పించింది.. ఆయనకి గ్రామీణాభివృద్ధి శాఖని కేటా యించింది. న్యాయశాఖ మంత్రిగా ఉన్న వీరప్ప మొయిలీకి కార్పొరేట్ వ్యవహారాలు అప్పగించి న్యాయశాఖ మంత్రిగా సల్మాన్ ఖుర్షీద్ని నియమించింది. ఉక్కు శాఖ మంత్రిగా బేనీప్రసాద్ వర్మ, పర్యావరణ , అటవీ శాఖకి జయంతి నటరాజన్, నీటి వనరుల శాఖకి పవన్కుమార్ బన్సల్ని నియమించింది.. మన రాష్ట్రానికి చెందిన సాయిప్రతాప్ని మంత్రి వర్గంలోనుండి తొలగించింది. అలాగే ఈ విస్తరణలో మన రాష్ట్ర ఎం.పి.లకు చోటు దక్కలేదు. మన రాష్ట్రం తరపున కావూరి సాంబశివరావుని కేబినెట్లోకి తీసుకోవాలని భావించినా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని మార్చుకుంది.. మ...