గవర్నర్ కాన్వాయి ప్రమాదం-తప్పెవరిది
ప్రభుత్వ ప్రముఖులకు, ఇతర ప్రముఖులకు ఐదు , అంతకన్నా మించి వాహనాలతో కాన్వాయి ఉంటుంది. వి.ఐ.పి.ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కాన్వాయిలను ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, జిల్లాలకు వెళ్లినప్పుడు మంత్రులకు కాన్వాయిలు ఉంటాయి. కొందరు నేతలు ప్రైవేటు గా భారీ కాన్వాయిలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కాని వారి కోసం రోడ్ ట్రాఫిక్ అంతటిని నిలిపివేసి ఎక్కడా ఇబ్బందిలేకుండా చేస్తారు. దీంతో వాహనాలు వాయువేగంతో వెళుతుంటాయి. అలాంటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దానికి కారణం ఏమిటంటే, ఈ వాహనాలు పోటీపడి పరుగులు తీస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాన్వాయికి ప్రమాదంజరిగింది. అలాగే ఆయా ప్రముఖుల కాన్వాయిలకు ప్రమాదాలు జరిగిన ఘటనలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. రోడ్ క్లియర్ గా ఉండడంతో అతివేగంగా వెళ్లడం వల్ల ఒకదానిని ఒకటి అందుకోవడానికి వాహనాల డ్రైవర్లు పోటీపడుతున్న సందర్బంలో ఒక్కోసారి అదుపు తప్పి బోల్తా పడడమో, లేక స్తంభాలను ఢీకొట్టడమో, లేక మనుషులను ప్రమాదాలకు గురిచేయడమో జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ కాన్వాయి కూడా ఇలాంటి సంద...