ఈనాడు, సాక్షిల కోల్డ్ వార్..!
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు, సాక్షి అధిపతి జగన్మోహన్ రెడ్డికి, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావులకు మధ్య నిత్య యుద్దం రక్తి కట్టిస్తోంది. జగన్ ఆస్తులపై కోర్టు విచారణకు ఆదేశాలు ఇవ్వగానే, ఈనాడులో జగన్ ఆస్తుల కేసు అని రాయకుండా అక్రమ ఆస్తుల కేసు అని పెట్టి కధనాలు ఇచ్చింది. ఇక సాక్షి కూడా రామోజికి సంబంధించి చిన్న వివాదం దొరికినా పెద్ద ఎత్తున రాస్తూ సందడిచేస్తోంది. ఇద్దరి మధ్య సాగుతున్న ఈ యుధ్దం ఎప్పుడు ఏ రూపం దాల్చుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రామోజీరావుకు వ్యతిరేకంగా సాక్షి ఒక కధనాన్ని ఇస్తూ మార్గదర్శి కేసు తేలకుండానే ఆయన ఆస్తులు అమ్మకానికి పెట్టారంటూ ఒక పెద్ద కధనాన్ని ఇచ్చింది. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు మొదలైంది. అప్పట్లో ఈ కేసుపై రకరకాల కధనాలు రావడం, ఆదాయపన్ను శాఖ కేసు పెట్టడం, సిఐడి కూడా దీనిపై విచారణ చేయడం వంటివన్ని జరిగాయి. అకస్మాత్తుగా రాజశేఖరరెడ్డి మరణంతో ఆ కేసులన్నీ వెనుకబడ్డాయి. ఆ తర్వాత జగన్ వంతు వచ్చింది. జగన్ అక్రమ ఆస్తుల...