సమైఖ్య హైదరాబాద్ కు సన్నాహాలు..?
రాష్ట్ర విభజన సమస్యపై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇక ఎక్కువకాలం ఈ సమస్యను అపరిష్కృతంగా ఉంచజాలమని భావిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ నగరమే ప్రదాన సమస్య అని కేంద్రం గుర్తించిందని, దానిపైనే దృష్టి పెట్టిందని ఆంద్రప్రభ పత్రిక ఒక కధనాన్న బ్యానర్ గా ఇచ్చింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో హైదరాబాద్ ను కేంద్రం పాలితప్రాంతంగా ఉంచి, ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడమే ఉత్తమ పరిష్కారమని భావిస్తు న్నట్లు ఈ పత్రిక తెలిపింది.హైదరాబాద్ తెలంగాణలో అంతర్భా గమని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నవారు గట్టిగా వాదిస్తుం టే, సీమాంద్రులు హైదరాబాద్ ను వదులు కోవడానికి సిద్దపడడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ను పూర్తిగా వదలిపెడితే తమకు రక్షణ ఉండదని సీమాంధ్రులు భయపడుతున్నారు. అందువల్ల దానికి వారు ఒప్పుకోవడం లేదు. ఈ నేపద్యంలో పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా చండీగడ్ ఉన్న రీతిలోనే హైదరాబాద్ ను కూడా ఉమ్మడి రాజధానిగాను, అలాగే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడమే ఉన్నంతలో మంచ...