నాయకులకి అన్నీ అప్పులే…
రాజకీయ నాయకుల ఆస్తి వివరాలు వెల్లడి ఆసక్తికరంగా ఉంటోంది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అందరి కన్నా ముందున్నానని ఆస్తులను ప్రకటించగా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధాని, మంత్రుల ఆస్తుల వివరాలను వెల్లడించింది.వారిలో మన రాష్ట్రానికి చెందిన ఆరుగురి ఆస్తి వివరాలు కూడా ఉన్నాయి. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్న కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డికి ప్రస్తుతం అప్పులే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది.ఆయన తన ఆస్తి వివరాలలో జూబ్లిహిల్స్ రోడ్డు నెంబరు పది లో ఆరువందల చదరపు మీటర్ల స్థలంలో ఇల్లు, మహబూబ్ నగర్ జిల్లా మాడ్గుల గ్రామంలో నలభై మూడు ఎకరాల వ్యవసాయ భూమి, 350 చ.మీ స్థలంలో భవనంలో నాలుగో వంతు, 3750చ.మీ. మరో భూమి ఉన్నట్లు ఆయన చూపారు. కాగా వివిధ బ్యాంకులలో డిపాజిట్లు 598826 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అప్పుల విషయానికి వస్తే, హైదరాబాద్ కార్పొరేష్ బ్యాంక్ నుంచి ఇంటి రుణం 1693402 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అలాగే పూచికత్తు లేని రుణం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని తెలిపారు.తన భార్య లక్ష్మి పేరుతో ఏడు లక్షల విలువైన బంగారం, టయోట క్వాలిస్ వాహనం, సేవింగ...