వైఎస్ఆర్ బొమ్మలకు పాతర..
ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు అనే ససామెత ఇక్కడ వాడొచ్చో లేదో తెలియదు కానీ.. వైఎస్ జగన్ పెట్టిన పార్టీ కారణంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలని పాతరేసే పరిస్థితి వచ్చింది. విశయమేంటంటే… వైఎస్ పేరుతో జగన్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీ కార్యాలయాల్లోనూ, పార్టీ పోస్టర్లపై వెఎస్ ఫోటోలు ఎలాగూ ఉంటాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలోనూ, గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలన్నింటినీ తీసేయాలని ప్రభుత్వం డిసైడయ్యింది. ఆయన ఫోటోలు ఉంటే జగన్ పార్టీకి సంబంధించినట్టుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయం గురించి జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. కాంగ్రెస్ పార్టీని విజయతీరాల్లోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖరరెడ్డి అని అనడంలో ఎలాంటి సందేహంలేదు.. మరి ఆయన ఫోటోలనే పార్టీ ఆఫీససుల్లోనూ, ప్రభుత్వ ఆపీసుల్లోనుండి తీసివెయ్యాలనే నిర్ణయం తో ముందు ముందు ప్రభుత్వం ఎలాంటి విమర్శలని ఎదుర్కొంటుందో..