పోస్ట్‌లు

chandrababu naidu naidu tdp kirankumar reddy bothsa satyanarayana congress party congress leaders nadendla manohar political news political articls lokpal billu anna hazare jan lok pal bill లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కోర‌లు లేని బిల్లు..

చిత్రం
లోక్‌పాల్ బిల్లు స్పూర్తిని నీరుగార్చేలా చేశారని, లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐని తేవాల్సిందే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలన్నారు. అవినీతిపరులను కఠినంగా శిక్షించేలా బిల్లు రావాలని బాబు పేర్కొన్నారు. అవినీతిపై ఎవరు పోరాడినా మద్దతు తెలుపుతామని, అవినీతి రహిత భారతదేశం కావాలని, దేశంలో అవినీతి అంతానికి జన్‌లోక్‌పాల్ బిల్లును అమలుచేయాలని చంద్రబాబు సూచించారు. కేంద్రం బ్లాక్‌మెయిల్ రాజకీయాలను పాల్పడుతోందని, అవినీతి మంత్రులకు మద్దతునిస్తోందని చంద్రబాబు విమర్శించారు. మద్యం, ఇసుక మాఫియాకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. హోంమంత్రే అరాచకవాదులకు మద్దతిస్తున్నారని బాబు ఆరోపించారు. కేబినేట్ మంత్రిపై హోమంత్రి మనుషులే దాడి చేశారని పేర్కొన్నారు.