పోస్ట్‌లు

t-congress leaders janareddy keshavarao ponnam prabhakar saperate telangana political news political articls political hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

14 ఎఫ్ క్లియర్ తర్వాతే..

చిత్రం
14 ఎఫ్ ను తొలగించాకే హైదరాబాద్ కు సంబంధించిన ఎస్సై పరీక్ష ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్సై పరీక్షలో హైదరాబాద్ కు సంబంధించిన ఎలాంటి నియామకాలు చేపట్టడం లేదన్నారు. ఈ ఎస్సై పరీక్షలో హైదరాబాద్ కు సంబంధించి ఒక్క ఉద్యోగమూ లేదన్నారు. 14 ఎఫ్ తొలగింపుపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై హోంశాఖ అడిగిన సందేహాలన్నింటికీ.. సమాధాన మిచ్చామని బొత్స తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులతో పాటు.. ఉద్యమనాయ కులు, ప్రజాసంఘాలు గుర్తించాలని బొత్సా సత్యనారాయణ సూచించారు. కాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణకు ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన మంగళవారం విశాఖ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.

టి-కాంగ్రెస్ రాజీనామాలకి ప‌రిష్కారం..?

చిత్రం
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎమ్.పిలు తమ పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరింపచేయకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులు చేసిన రాజీనామాలు ఉపసంహరించుకుంటే మిగిలిన రాజకీయ పార్టీలు దానిని తమ ప్రయోజనానికి వాడుకోవచ్చని పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అభిప్రాయపడుతున్నట్ల కధనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు టిడిపి, టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ పక్షాలకు చెందిన నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అవన్ని స్పీకర్ల వద్ద పెండింగులో ఉన్నాయి. పార్టీ పరంగా కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెచ్చి ఉపసంహరింపచేస్తే, మిగిలిన పార్టీలు ఉపసంహరించుకోకపోతే , ఈ నేతల రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని పార్టీ నాయకత్వం గుర్తించింది.అంతేకాక ఆ నేతల భవిష్యత్తుతో పాటు కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ నేతలపై ఒత్తిడి తేరాదన్నది ఎ.ఐ.సి.సి అభిప్రాయంగా ఉంది.తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉపసంహరించుకుంటే ప్రజల దృష్టిలో చులకన అవుతారని అందువల్ల దీనికి వేరే పరిష్కారమే సరైనదని భావిస్తున్నారు. స...

స్వార్థం ముఖ్యమా..? ఆవేద‌న ముఖ్యమా..?

చిత్రం
పది రోజుల్లో కేంద్రం తెలంగాణ ఇస్తానని మాట ఇస్తే ఢిల్లీ వెళతామని ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆజాద్ తన మాటలను వెనక్కి తీసుకున్న పక్షంలో చర్చలకు సిద్దమని చెప్పారు. ఢిల్లీ వెళ్లినా తెలంగాణ తప్ప దేనికీ ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ సాధన కోసం సీమాంధ్ర ఆర్థిక మూలాలు దెబ్బ తీయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సినిమాలు చూడవద్దని సూచించారు. రాజీవ్ రహదారి విస్తరణ పనులు అడ్డుకోవాలని సూచించారు. తెలంగాణ ఇప్పుడు రాకుంటే మరెప్పుడూ రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. 200 మంది సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల స్వార్థం ముఖ్యమా, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆవేదన ముఖ్యమా అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. తెలంగణ ఇవ్వ కుంటే పరిపాలన స్తంభింప చేయడానికి సిద్ధమన్నారు. రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసం ఈ నెల 20న మున్సిపల్ స్థాయిలో సామూహిక నిరాహార దీక్షలు కాంగ్రెసు చేపడుతుందని రాజ్య సభ సభ్యుడు కె కేశవరావు చెప్పారు. 26న జెండా పండుగ నిర్వహిస్తామన్నారు. కాంగ్రెసు జెండాలో తెలంగాణ జెండా ఉంచి ఎగుర వేయాలని సూచించారు. తెలంగాణపై ఎలాంటి ...

ఒక్కో ప‌ద‌వికి ఇద్దరు నాయ‌కులు

చిత్రం
తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా ముందుకు తీసుకు వెళ్లడానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏర్పా టు చేసుకున్న కమిటీకి ఇద్దరు చైర్మన్లు, ఇద్దరు కన్వీనర్లు, ఇద్దరు కోఆర్డినేటర్లు ఉండడం విశేషం. ఛైర్మన్లుగా మంత్రి జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు వ్యవహరిస్తారు. కన్వీనర్లుగా మంత్రి బసవరాజు సార య్య, కరీంనగర్ లోక్ సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఉంటారు. ఇక సమన్వయకర్తలుగా లోక్ సభ సభ్యులు రాజగోపాలరెడ్డి, వివే క్ లు ఉన్నారు.ఒక్కో పోస్టుకు ఇద్దరేసి నాయకులను పెట్టుకున్నారు.ఇందులో ఎవరి పాత్ర ఏమిటో తెలియదు. మొత్తం ఇరవై రెండు మందితో ఈ కమిటీ ఉంటుంది. తెలంగాణలో ప్రజాప్రతినిదులు కాంగ్రెస్ కు చెందినవారు ఎనభైమంది లోపు ఉంటే వారిలో నాలుగో వంతు కమిటీలో ఉన్నారు. ప్రధాన పద వులలో మంత్రులు , పార్లమెంటు సభ్యులను నియమించుకున్నారు.