5.45 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేష్ డి లడ్డును ఐదులక్షల నలభై ఐదు వేల కు వేలం పాటలో కొనుగోలుచేశారు. ఈసారి బాలాపూర్ గ్రామస్తులే దీనిని సొంతంగా చేసుకున్నారు. కొలను మోహన్ రెడ్డే ,కృష్ణారెడ్డి సోదరులు వేలంపాటలో ముందంజలో ఉండడం విశేషం. గత ఏడాదికన్నా పది వేల రూపాయలు అధిక ధరకు వీరు వేలంపాటలో పాడుకున్నారు. గణేష నిమజ్జనం సందర్భంగా ప్రతి ఏడాది ఆయా చోట్ల లడ్డు వేలంపాటలు జరుగుతుంటాయి. వాటిలో బాలాపూర్ లడ్డకు ప్రత్యేకత ఉంది. కొలను బ్రదర్స్ తరచు దీనికోసం పోటీపడుతుంటారు. ఈసారి వారికే లడ్డు దక్కింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి