గాలికి మళ్లీ చుక్కెదురు..
కర్నాటక మాజీ మంత్రి గాలిజనార్ధనరెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు బెయిల్ తిరస్కరించింది. రెండు రోజులపాటు గాలి బెయిల్ వాదోపవాదాలు జరిగాయి. అంతేకా ఈ నెల పందొమ్మిదో తేదీ వరకు గాలి జనార్ధనరెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని సిబిఐ కస్టడి ఇవ్వడానికి కూడా జడ్జి ఆదేశాలు ఇచ్చారు. గాలి జనార్ధనరెడ్డి నుంచి అనేక విషయాలు రాబట్టవలసిన అవసరం ఉన్నందున వారిద్దరిని తమ విచారణార్ధం కస్టడికి ఇవ్వవలసిందిగా సిబిఐ న్యాయవాది వాదించారు. గాలి జనార్ధనరెడ్డి కోసం ప్రత్యేకంగా జోధ్ పూర్ నుంచి న్యాయవాది ప్రత్యేక విమానంలో రావడం సంచలనం సృష్టించింది. అయినప్పట్టికీ గాలికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి