అజారుద్దీన్ కుమారుడికి తీవ్రగాయాలు..
మాజీ క్రికటర్, ఎం.పి. అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్కి రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. అవుటర్ రింగ్రోడ్డు గుండా బైక్పై అతివేగంతో వెళ్ళడంతో పుప్పాలగూడా టోల్గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు. అయాజుద్దీన్తో పాటు అతని స్నేహితుడు అద్నాన్ కూడా బైక్పై ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన వీరిని పోలీసులు అపోలో హాస్పిటల్కి తరలించారు. వీరు బైక్ రేస్లో పాల్గొని అతివేగంతో బైక్ నడపటంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలో ఉన్న అజారుద్దీన్ తన కుమారుడి ప్రమాద వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. బైక్రేస్లన్నవి ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి