అక్క‌డ గాలి బ్ర‌ద‌ర్స్‌.. ఇక్క‌డ సాయి బ్ర‌ద‌ర్స్‌


ఓబులాపురం మైనింగ్ కింగ్ గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి అరెస్టుతో ఒక్కొక్క‌టిగా మైనింగ్ మాఫియా గుట్టు ర‌ట్ట‌వుతోంది. తాజాగా కృష్ణాజిల్లా కొండ‌ప‌ల్లిలో మైనింగ్ మాఫియాని పోలీసులు అరిక‌ట్టారు. ఇక్క‌డ కూడా మైనింగ్ మాఫియా అక్ర‌మ క్వారీలు నిర్వ‌హిస్తుంద‌ని మైనింగ్ య‌జ‌మానుల‌యిన సాయి బ్ర‌ద‌ర్స్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయ‌ల మైనింగ్‌ని అక్ర‌మంగా త‌ర‌లిస్తూ ప్ర‌భుత్వ నిధిని పెద్ద ఎత్తున కొల్ల‌గొట్టిన ఘ‌నులు వీరు. వీరి వెనుక పెద్ద‌ల హ‌స్తం కూడా ఉండి ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది సాయిని అరెస్టు చేయ‌గానే ఆయ‌న్ని విడిపించేందుకు ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయకులంద‌రూ తీవ్రంగా కృషి చేసార‌ని తెలుస్తోంది. గాలి బ్ర‌ద‌ర్స్ వేల కోట్ల రూపాయ‌ల‌ని అక్ర‌మంగా సంపాదిస్తే ఈ సాయి బ్ర‌ద‌ర్స్ కూడా వారిని అనుస‌రించి వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ని వెన‌కేసుకున్నార‌ని పోలీసులు నిర్థారించారు. మ‌రి వీరి వెనుక ఉన్న పెద్ద‌లు ఎవ‌రో తెలిస్తే గాని అస‌లు సంగ‌తి తెలియ‌దు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!