టీజీ పై మ‌ధుయాష్కీ ఫైర్‌..!

సోమవారం ఎంపీ మంద జగన్నాధం ఇంట్లో టి-కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాష్కీ మాట్లాడారు. టిజి వెంకటేష్ ఓ కెడి అన్నారు. ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేస్తే మా సత్తా చూపిస్తా మన్నారు. మాజీ మంత్రి రేణుకా చౌదరికి దమ్ముంటే తాను సమైక్య వాదినని ప్రకటించాలని డిమాండ్ చేశా రు. దళితులను అణిచి వేయాలని తెలంగాణ కాంగ్రెసు చూడ టం లేదన్నారు. తెలంగాణ కోసం పోరాడితే దళితులే ముఖ్యమంత్రి కావచ్చునని అన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి కేంద్రం స్పష్టం చేసే వరకు రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజీనామాలు ఆమోదిస్తే కేంద్రానికి మన బలం చూపెట్టవలసి ఉంటుందన్నారు. తెలంగాణ కోటా కింద కొందరు పదవులు దక్కించుకున్నారని వారు ఇప్పుడు ఉద్యమంలో పాల్గొనడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ రాష్ట్రానికి ఇంచార్జా ఆంధ్రా వాళ్లకా అని ఎమ్మెల్యే కెఎల్ఆర్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. హైదరాబాదులోని ఆంధ్రా వాళ్లకు నీళ్లు బంద్ చేసి చెత్త తీయడం మానేద్దామని సూచించారు. సూడాన్ తరహాలో నూటికి నూరుపాళ్లు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని మంత్రి జానారెడ్డి అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!