ఆలస్యంగా వెళ్లడానికి అదేమన్నా ఆఫీసా..?
దేశం చూపు మొత్తం ఈ రోజు తెలంగాణ ఎంపి.ల చుట్టూ ఉందన్న విషయం తెలుసు.. తాము సరిగ్గా పద కొండు గంటలకి స్పీకర్ మీరాకుమార్ ఆప్పాయింట్మెంట్ తీసుకు న్నారనీ తెలుసు.. కానీ ఆ సమయానికి పార్లమెంటు కు వెళ్లడం మాత్రం తెలియదు.. స్పీకర్ ఠంచనుగా పదకొండు గంటల కల్లా పార్లమెంటుకు వచ్చేసింది. ఆ సమ యానికే రావలసి ఎం.పి.లు ఎవరూ రాకపోవడంతో ఓ పదినిమిషాలు చూసి తన మానాన తాను వెళ్లి పో యింది.. తెలంగాణ కోసం తాడో పేడో తేల్చుకోవాల్సిన ఈ సమయంలో ఇలా టైం మేనేజ్మెంట్ పాటించకపోతే ఎలా..? అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎం.పీలపై గుర్రుమంటున్నారు.. అయినా ఆలస్యంగా వెళ్లడానికి అదేమన్నా ఆఫీసా.. పార్లమెంటు.. అదీ కూడా తెలీదు మన ఎంపీలకు.. హు..!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి