క‌డుపు చించుకుంటే కాళ్ళ‌మీద‌..


క‌డుపు చించుకుంటే కాళ్ళ‌మీద ప‌డుతుంద‌ని అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ ర‌వీంద్ర‌నాథ్‌. త‌న శాఖ‌లో ఉన్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌టం కోసం ఆయ‌న పూనుకున్న‌ప్ప‌టికీ సి.ఎం. నుండి స‌హ‌కారం అంద‌డంలేద‌ని అంటున్నారు. త‌న శాఖ‌లో ఉన్న అవ‌క‌త‌వ‌క‌ల గురించి వివ‌రించే సంద‌ర్భంలో ఆయ‌న క‌డుపు చించుకుంటే కాళ్ళ‌మీద ప‌డుతుంద‌న్న సామెత‌ని వాడ‌డం విశేషం. ఈ మ‌ధ్య సి.ఎం. కిర‌ణ్‌కుమార్‌కి, డిఎల్‌కి మ‌ధ్య అంత‌రం పెరిగిపోతుంది. సీఎం పనితీరుపై డీఎల్ అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. తన శాఖలో జరుగుతున్న కార్యకలాపాలపై నిస్సహాయతను వ్యక్తం చేస్తు న్నారు.  వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని డీఎల్‌ గత కొంత కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏమి చేయలేకపో తున్నట్లు నిస్సాహయతను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రోశయ్య సీఎంగా ఉండగా ప్రభుత్వ ఆసుప త్రుల్లో మౌళిక సదుపాయల కోసం కేటాయించిన 65 కోట్ల రూపాయలను ఇప్పటికీ ఖర్చుచేయకపోవడంతో అధికారులు కూడా రాజకీయ నేతల్లా తయారయ్యారని డీఎల్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సిఎం. ప‌నితీరుపై అధిష్టానానికి ఫిర్యాదుని కూడా పంపిన‌ట్టు చెప్పుకుంటున్నారు. మ‌రి.. డిఎస్‌, సి.ఎం. ల మ‌ధ్య ఏర్ప‌డిన ఈ అగాధం ఎలా స‌మ‌సిపోతుందో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!