రైల్వే శాఖపై చిరంజీవి చూపు…!
చిరంజీవికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దాదాపు ఖాయమైపో యిందని, ఆయనకి షిప్పింగ్ శాఖ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే చిరంజీవి షిప్పింగ్ శాఖ కంటే రైల్వే శాఖపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడంతో ఆమె నిర్వహించిన రైల్వే శాఖ ప్రస్తుతం ఖాళీగా ఉంది. అయితే రైల్వే శాఖను తృణమూల్ కాంగ్రెసుకే ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకుదని. మమతా బెనర్జీ కూడా అదే కోరుతున్నారని, అందువల్ల రైల్వే శాఖ చిరంజీవికి ఇవ్వడం కుదరనే పద్ధతిలో కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. తొలిసారి మంత్రి పదవి చేపడుతున్న చిరంజీవికి కీలకమైన శాఖ ఇస్తే ఇబ్బందులు ఎదురు కావచ్చునని అనుకుంటోంది ఈ పరిస్థితిలో చిరంజీవి జరుపుతున్న లాబీయింగ్ని, రాష్ట్రంలో కాంగ్రెస్కి చిరంజీవి సపోర్ట్ ఎంతవరకు బలం చేకూరుతుందో అన్నదాన్ని బట్టి చిరంజీవికి రైల్వే శాఖ కేటాయించడంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది వేచిచూడాలి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి