బాబు తలుచుకుంటే ప్రభుత్వం కూలుతుంది
కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ ప్రాణం చంద్రబాబు చేతిలో ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. చంద్రబాబు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుందని, టీడీపీ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ శనివారం విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ ఏ కారణం చూపకుండా అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు. టీడీపీ మోసపూరిత వైఖరికి ఇదే నిదర్శనమని, తనపై సీబీఐ కేసులు పెట్టారనే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం అవసరం లేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సభలో తెలంగాణ తీర్మానం చేశాకే అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నది తమ డిమాండ్ అని అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి