రాజీవ్ కిరణాలపై బొత్స సందేహం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం మంత్రివర్గం సమావేశంలో ముఖ్యమంత్రిని నిలదీసిన బొత్స , దానికి కొనసాగింపుగా రాజీవ్ యువకిరణాలు స్కీమ్ గురించి ప్రశ్నించిన తీరు ఆసక్తికరంగా ఉంది. లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమని బొత్స ప్రశ్నించగా,అది సాధ్యమేనని,ఇచ్చి చూపిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విశేషం.ప్రభుత్వ స్కీముపై పిసిసి అధ్యక్షుడికే సందేహాలు వస్తే మిగిలినవారిని సంతృప్తిపరచడం ఎలా అన్నప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. కాగా 104,108 మొబైల్ సర్వీసులకు సంబంధించి జరుగుతున్న చర్చలకు తనను కూడా పిలవాలని బొత్స మంత్రి డి.ఎల్ రవీంద్రరెడ్డికి లేఖ రాయడం ఆసక్తికరంగా ఉంది. మెల్లగా ఇతర అంశాలు సర్దుకునే కొద్దీ కాంగ్రెస్ లో వర్గ పోరు బయట పడుతుంటుంది. ఇప్పుడు జరుగుతున్న అదేలా కనబడుతోంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి