టి-కాంగ్రెస్ ఎం.పీలు డబుల్ గేమ్ ఆడుతున్నారా..?
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పి ల తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది.ముందుగా రాజీనామాలు ఆమోదించుకున్న తర్వాత మాత్రమే రైల్ రకో ఆందోళనలో పాల్గొనాలని, లేకుంటే ఏ ముఖం పెట్టుకుని ఉద్యమంలో పాల్గొంటారని బిజెపి తెలంగాణ ఉద్యమ కమిటీ ఛైర్మన్ రాజేశ్వరరావు విమర్శించారు.కేంద్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకునే విధంగా వ్యవహరిస్తూ, ఇక్కడ ఆందోళన చేస్తామంటే ఎవరు నమ్ముతారని ఆయన అన్నారు.ముందుగా రాజీనామాలు ఆమోదించుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.రైల్ రకో ఆందోళనకు వచ్చే కాంగ్రెస్ ఎమ్.పిలను తెలంగాణవాదులంతా నిలదీయాలని , వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి