సత్యం కేసుకి తెలంగాణ సెగ
సకల జనుల సమ్మెకు మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి రెండు రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో కేసులన్నీ పెండింగ్ పడిపోయాయి. దీంతో వారం రోజుల పాటు కేసులన్నీ వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి కోర్టు పేర్కొంది. సత్యం కుంభకోణంలో ప్రధాన నిందుతుడు రామలింగరాజు కేసు విచారణకు తెలంగాణ సెగ తగిలింది. సకల జనుల సమ్మె నేపథ్యంలో నాంపల్లి ట్రయల్ కోర్టులో విచారణకు ఆటంకం ఏర్పడింది. దీంతో కేసు విచారణను నాంపల్లి నుంచి చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చ వలసిందిగా హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 226 మంది సాక్షులు, 15 మంది దర్యాప్తు అధికారుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి