రైలురోకో కు బిజెపి ముఖ్య నాయ‌కులు దూరం..?


సమ్మెలో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో తెలంగాణ జేఏసీ చేపట్టనున్న రైల్‌రోకోకు బీజేపీ ముఖ్య నేతలు దూరంగా ఉండనున్నారు. ఆ రోజు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే రైల్‌రోకోలో పాల్గొనాలని, ముఖ్య నేతలు అద్వానీ రథయాత్ర విజయవంతంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. గురువారం పార్టీ కార్యాల యంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో దత్తాత్రేయ, వి.రామారావు, విద్యాసాగర్‌రావు, కె.లక్ష్మణ్, ఇంద్రసే నారెడ్డి, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అద్వానీ రథయాత్ర, రైల్‌రోకోపై చర్చ జరిగింది. అద్వానీ రథ యాత్ర సాగే ఆరు జిల్లాల్లో మొత్తం తొమ్మిది చోట్ల రోడ్డుషోలను ఏర్పాటు చేస్తున్నారు. అద్వానీ పాల్గొనే ముందు ఈ సభల్లో మాట్లాడడానికి కొంత మంది నేతలను ఎంపిక చేశారు. సభలకు జన సమీకరణ బాధ్యతలను కూడా ఆయా నేతలకు అప్పగించారు. కాగా అద్వానీ రథయాత్ర ఏర్పాట్లలో రాష్ట్ర ముఖ్య నేతలు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున.. రైల్‌రోకోలో బీజేపీ కూడా పాలుపంచుకుందన్న సంకేతాలు పంపడానికి రెండో శ్రేణి నేతలు పాల్గొనాలని సమావేశం ఆదేశించింది. ఈ మేరకు రైల్‌రోకోలో పాల్గొనే నేతల పేర్లు కూడా నిర్ణయించారు. గతంలో జేఏసీ నిర్వహించిన రైల్‌రోకోలో బీజేపీకి అప్పగించిన ఆరు సెక్టార్లలో ఆ పార్టీ రెండో శ్రేణి నేతలు పాల్గొనాలని నిర్ణయించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!