రైల్రోకో మళ్ళీ వాయిదా..!
తెలంగాణ జెఎసి ఈనెల పన్నెండో తేదీన తలపెట్టిన రైల్ రకో వాయిదా పడే అవకాశం కనబడుతోంది.బాన్స్ వాడ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఈసారి రైల్ రకోను ఈనెల పదిహేను కు వాయిదా వేయాలని జెఎసి భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ జెఎసి నాయకత్వం సమావేశమై దీనిపై చర్చ జరుపుతోంది. బాన్స్ వాడ ఉప ఎన్నిక ఈ నెల పదమూడువ తేదీన జరగనుంది. ఈ నేపధ్యంలో దీనిని వాయిదా వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి అంటే తొమ్మిదో తేదీ నుంచి మూడు రోజుల పాటు రైల్ రకో చేయాలని భావించి , దానిని పన్నెండో తేదీకి వాయిదా వేశారు.తిరిగి దీనిని పదిహేనో తేదీకి దాదాపు వాయిదా వేసినట్లేనని చెబుతున్నారు.కాగా ఆదిలాబాద్ జిల్లాలో ఒకచోట రైలు పట్టా పీకివేయడంతో గూడ్స్ రైలు ప్రమాదానికి గురి అయింది. గుర్తు తెలియని దుండగులు ఇది చేశారని చెబుతున్నప్పట్టికీ, ఇది ఉద్యమం ప్రమాద స్థాయికి వెళుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అవుతుంది. ప్రభుత్వం ఇలాంటి వాటిని అదుపు చేయగలుగుతుందా అన్న సందేహం ఉంది. అందువల్ల వెంటనే తెలంగాణపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తే తప్ప ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడడం లేదు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి