సిఎం తో అమీతుమీకి సిద్దప‌డ్డ టి-ఎంపీలు


తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలవడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కార్యాచరణ నిర్ణయించుకున్నారు. రైల్ రకో ఆందోళనను సీరియస్ గా తీసుకుంటామని కేసులు పెట్టవలసి వస్తుందని పోలీసు శాఖ స్పష్టంగా హెచ్చరించగా , దానిని ఎదుర్కోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు రంగంలో దిగుతున్నారు. గద్వాలలో ఎమ్.పి మంధా జగన్నాదం, నల్లగొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, జమ్మికుంటలో పొన్నం ప్రభాకర్ , మహబూబాబాద్ లో బలరాం నాయక్ వరంగల్ లో రాజయ్య, నిజామాబాద్ లో మధుయాష్కి రైల్ రకోలో పాల్గొంటారని ప్రకటించారు.తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వంతోను, కేంద్ర ప్రభుత్వంతోను తలపడుతున్నారని బావించాలి. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్దమవుతున్నామని భావించాలి. కాగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దూకుడుగా వెళుతున్నారని, ప్రభుత్వం, పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!